అమరావతి : వైఎస్ వివేకానందారెడ్డి హత్య కేసులో నేరారోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి(MP Avinash Reddy) మరోసారి సీబీఐ(CBI) ఎదుట విచారణకు గైర్హాజరయ్యారు. శుక్రవారం సీబీఐ విచారణకు హాజరు కావాలని గత మూడు రోజుల క్రితం పులివెందుల( Pulivendula)లోని అవినాష్రెడ్డి ఇంటికి సీబీఐ అధికారులు వెళ్లి నోటీసు అందజేశారు. తనకు ముందస్తు కార్యక్రమాలు ఉన్నందున హాజరు కాలేనని నాలుగు రోజులు గడువు కావాలని సీబీఐని కోరగా అందుకు సీబీఐ తిరస్కరించి రెండురోజులు మాత్రమే గడువిచ్చి ఈనెల 19న రావాలని నోటీస్లో పేర్కొన్నారు.
అయితే శుక్రవారం చివరి సమయంలో తన తల్లి అనారోగ్యం(Mother illness)తో ఉన్నారనే సమాచారంతో ఆయన హడావుడిగా పులివెందులకు బయలు దేరారు. తన తల్లికి గుండెపోటు వచ్చిందని విచారణకు రాలేనని సీబీఐకి ఆయన సమాచారం అందించారు. ఇందుకు సంబంధించిన లిఖితపూర్వకంగా తెలియజేయడానికి అవినాష్రెడ్డి న్యాయవాదులు(Advocates) సీబీఐ కార్యాలయానికి వెళ్లి లేఖను అందజేశారు.