ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన వైఎస్ వివేకా హత్యకేసులో నిందితుడైన డ్రైవర్ దస్తగరి సంచలన వ్యాఖ్యలు చేశాడు. అతను అప్రూవర్గా మారేందుకు ఏపీ హైకోర్టు అనుమతించింది. ఈ క్రమంలో పులివెందుల ఆర్అండ్బీ గెస్ట్హౌస్లో ఉంచిన అధికారులు.. గంటపాటు దస్తగిరిపై విచారణ జరిపారు. ఈ సమయంలో బాధలు తట్టుకోలేకపోవడంతోనే తాను అప్రూవర్గా మారినట్లు దస్తగిరి తెలిపాడు.
తన భార్యాబిడ్డలు అనాథలవుతారనే భయంతోనే సీబీఐకి జరిగిన విషయం చెప్పానని చెప్పాడు. కుటుంబం కోసమే తాను అప్రూవర్గా మారినట్లు వెల్లడించాడు. దీంతో అతని నుంచి సెక్షన్ 164 వాంగ్మూలం తీసుకోవడానికి సీబీఐ సన్నద్ధమైంది. అతను అప్రూవర్గా మారేందుకు కడప కోర్టు గత నవంబరు 26నే అనుమతించింది. కానీ దీనిపై కొందరు ఏపీ ఐకోర్టును ఆశ్రయించారు.
అయితే వీరి కేసును హైకోర్టు కొట్టిపారేసింది. కింద కోర్టు తీర్పును సమర్దిస్తూ నిందితులు వేసిన పిటిషన్లను కొట్టివేయడంతో దస్తగిరి అప్రూవర్గా మారడానికి లైన్ క్లియర్ అయింది. దీంతో సీబీఐ అధికారులు దస్తగిరితో రెండవసారి 164 వాంగ్మూలం ఇప్పించేందుకు పులివెందుల కోర్టు అనుమతిని తీసుకున్నారు. అదే సమయంలో ఈ కేసు తదుపరి విచారణను పులివెందు కోర్టు నుంచి కడప జిల్లా కోర్టుకు బదిలీ చేసింది. ఇకపై ఈ కేసుకు సంబంధించిన విచారణ మొత్తం కడప కోర్టులోనే జరగనుంది. సీబీఐ అభ్యర్థ మేరకు కోర్టు ఈ నిర్ణయం తీఃసుకున్నట్లు తెలిపింది.