అమరావతి : దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్కు నిజమైన వారసురాలు వైఎస్ షర్మిల అని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి ( Telangana CM Revanth ) పేర్కొన్నారు. వైఎస్సార్ (YSR)ఆశయాల కోసం పోరాడే వారే నిజమైన వారసులని, వైఎస్ జగన్(Jagan) కాదని స్పష్టం చేశారు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని ఆరోపించారు. విశాఖపట్నంలో కాంగ్రెస్ పార్టీ ఆధర్వంలో ‘విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు ’ సభలో ఆయన మాట్లాడారు. వైఎస్సార్ కలలను నిజం చేయడానికి షర్మిల సంకల్పానికి సహకరించాలని కోరారు.
ఇక్కడ పాలించే వ్యక్తులు పాలన కోసం తప్పితే, ప్రశ్నించే వారు కాదని చంద్రబాబు, పవన్కల్యాణ్ , వైసీపీ అధ్యక్షుడు, సీఎం జగన్పై విరుచుకుపడ్డారు. బీజేపీ అంటే బాబు(Babu), జగన్(Jagan), పవన్కల్యాణ్(Pawan) అంటూ ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికల్లో ముగ్గురిలో ఎవరూ గెలిచినా చివరకు మోదీ ఖాతాల్లోకే వెళుతాయని, వీరంతా మోదీ బలగమేనని ఆరోపించారు. ముత్యాల ముగ్గులో రావుగోపాలరావు పక్కన ఉండే ఇద్దరు తానా అంటే తందానా అనే పాత్ర మాదరిగా చంద్రబాబు, పవన్కల్యాణ్ కూడా అదే పాత్ర పోషించనున్నారని విమర్శించారు.
రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం మోదీని ప్రశ్నించే గొంతుకలు ఎన్నికల్లో గెలవాలని, వెన్నముక లేని వారిని ఎన్నుకోవద్దని సూచించారు. పాలకుల్లో చిత్తశుద్ధి లేకపోవడం వల్ల ఏపీలో గత పదేండ్లలో పోలవరం పూర్తి కాలేదు. రాజధాని లేదని పేర్కొన్నారు. విభజనతో వీడిపోయిన తెలుగువారంతా ఐక్యంగా ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని వెల్లడించారు.