అమరావతి : ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి(YS Jagan )ప్రతిసారి ఢిల్లీకి వెళ్లి అక్కడి పెద్దల కాళ్లు పట్టుకుని బ్రతిమిలాడి వస్తున్నారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు( Achchennaidu) విమర్శించారు. గురువారం ఆయన కాకినాడ జిల్లాలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అన్ని వర్గాల నుంచి వస్తున్న వ్యతిరేకత పెరుగక ముందే ముందస్తు ఎన్నికలు జరుపాలని మరోసారి ఢిల్లీకి వెళ్లి మోకరిల్లారని దుయ్యబట్టారు.
ప్రభుత్వం, సీఎం అవలంభిస్తున్న విధానాల వల్ల ఏ ఒక్క వర్గం ప్రభుత్వ పాలనపై సంతృప్తిగా లేరని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. పొత్తుల విషయాన్ని ప్రస్తావిస్తూ పొత్తులు సర్వసాధారణ విషయమని వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టుకు రివర్సు టెండర్ విధానంతో ప్రాజెక్టును సర్వనాశనం చేశారని మండిపడ్డారు.