అమరావతి : పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కాల్పులు కలకలం సృష్టించాయి. ప్రేమ పెళ్లికి నిరాకరించడంతో కావ్య అనే యువతిపై కాల్పులు జరిపాడు ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్. ఆ తర్వాత తాను అదే గన్తో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామంలో చోటు చేసుకున్నది. మాలపాటి సురేష్రెడ్డి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. సురేశ్రెడ్డి తాటిపర్తి గ్రామానికి కావ్య కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. కావ్య పుణెలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పని చేస్తున్నది. కావ్యను తనకు ఇచ్చి పెళ్లి చేయాలని తల్లిదండ్రులను కలిసి సురేష్రెడ్డి చాలా రోజులు ప్రయత్నాలు చేస్తున్నాడు.
అయితే, కావ్యను సురేశ్కు ఇచ్చేందుకు తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. మరోసారి పెళ్లి విషయమై కావ్య తల్లిదండ్రులతో మాట్లాడేందుకు సురేష్ ఇవాళ తాటిపర్తికి వచ్చాడు. అయితే, వివాహానికి ఒప్పుకోకుంటే తుపాకీతో బెదిరించాలని భావించి.. తుపాకీని వెంట తెచ్చుకున్నట్లు తెలుస్తున్నది. ఈ క్రమంలోనే పెళ్లి కావ్య తల్లిదండ్రులు నిరాకరించడంతో గన్తో కావ్యపై కాల్పులు జరిపాడు. వెంటనే కుటుంబీకులు కావ్యను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందింది. ఆ తర్వాత సురేశ్రెడ్డి సైతం గన్తో కాల్చుకోగా.. తీవ్ర గాయాలతో మృతి చెందాడు. కాల్పుల ఘటనతో జిల్లాలో కలకలం సృష్టించింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉన్నది.