అమరావతి : వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం కారణంగా రేపు, ఎల్లుండి ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. వాయుగుండం బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశముందని వెల్లడించింది. ఈ వాయుగుండం ప్రసుత్తం ఒరిస్సాలోని బాలాసోర్కు దగ్గర్లో గంటకు 20 కిమీ వేగంతో వాయివ్యంగా ప్రయాణి స్తోందని సంబంధిత శాఖాధికారులు తెలిపారు.
ఈ కారణంగా ఒరిస్సా, ఝూర్ఖండ్, చత్తీస్ఘడ్, వెస్ట్ బెంగాల్ రాష్రాలతో పాటు ఏపీలోని ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తాల్లో శని, ఆదివారాల్లో భారీ వర్షాలు అవకాశాలున్నాయని స్పష్టం చేసింది . దీంతో విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు ఎల్లో హెచ్చరికను జారీ చేసింది .