అమరావతి : కేంద్రం ఇటీవల పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలకు ( Fuel Price Hike ) నిరసనగా వైసీపీ ఆధ్వర్యంలో సోమవారం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించింది. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో శాంతియుతంగా ధర్నా నిర్వహించి జిల్లా కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్లకు వినతి పత్రాలు అందజేశారు.
గుంటూరులో జరిగిన ఆందోళనలో మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ అన్ని రాష్ట్రాల్లో కన్నా ఏపీలోనే పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా ఉన్నాయని ఆరోపించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం కమీషన్లు వచ్చే పనులు మాత్రమే చేస్తుందని మండిపడ్డారు. పొదుపు పేరుతో డ్రామాలు, స్టంట్లు చేస్తున్నారని విమర్శించారు.
ముగ్గుర్ని కంటే ముప్పై వేలు, నలుగురిని కంటే నలబై వేలు ఇస్తామని అంటున్న చంద్రబాబు పిల్లల్ని కనమని చెప్పై నైతికత లేదని అన్నారు. మాజీ ఎమ్మల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ ఏపీలో ఆర్టీసీని ప్రైవేటీకరించడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు. అప్పులు చేసి అమరావతిపై పెట్టడం దారుణమని ఆరోపించారు. తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో దున్నపోతును ఆటోకు కట్టి లాగించారు. రైల్వే కోడూరు పార్టీ కార్యాలయం నుంచి టోల్గేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.