అమరావతి : ఏపీ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పేదల అవసరాలను తీర్చున్నది కేవలం వైసీపీ ప్రభుత్వమని ఏపీ సీఎం జగన్ వెల్లడించారు. విశాఖలోని ఆంధ్రా యూనివర్శిటీ కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. లక్ష65వేల కోట్ల రూపాయలు నేరుగా లబ్ధిదారుల అకౌంట్లకు లంచాలకు తావులేకుండా అందజేస్తున్నామని పేర్కొన్నారు.
గత టీడీపీ హయాంలో చేపట్టిన అప్పుల కంటే తాము అప్పులు తక్కువగా చేస్తున్నామని అన్నారు. నాటి ప్రభుత్వం దోచుకోవడం, దాచుకోవడం చేశారని అన్నారు. పేద ప్రజల గురించి ఏనాడు ఆలోచించలేదని టీడీపీ నాయకులపై మండిపడ్డారు. ఈ సందర్భంగా వాహన మిత్ర నాలుగో విడత నిధులను ఆయన విడుదల చేశారు.