అమరావతి : ఏపీకి చెందిన వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ మరోసారి సొంత పార్టీపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు. పోలీసులే అరాచకాలకు పాల్పడితే ఇక రక్షణ కోసం ఎవరిని అడగాలని నిలదీశారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అరెస్టులు చేయడం అన్యాయమని పేర్కొన్నారు. పల్నాడు జిల్లాలో టీడీపీ కార్యకర్తల అరెస్టు విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ నోటీసులు కూడా లేకుండా అరెస్టు ఎలా చేస్తారని ప్రశ్నించారు.
ఒక్క అవకాశమంటూ అరాచకాలకు పాల్పడడం బాధకరమని పేర్కొన్నారు. ఉద్యోగుల ఖాతాల్లో నుంచి జీపీఎఫ్ డబ్బులు లాగేసారని, డీఏ బకాయిలు చెల్లించామని అందమైన అబద్ధం చెప్పారని విమర్శించారు. రూ. 800 కోట్లు పొరపాటున తీసేశామని సర్దిచెప్పుకుంటున్నారని ఆరోపించారు.
తనను భీమవరం వెళ్లకుండా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. తనకు ఏదేని జరిగితే ప్రభుత్వం, సీఎస్, డీజీపీదే బాధ్యత అని అన్నారు.