అమరావతి : కడప జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తులు వైసీపీ ఎమ్మెల్సీ సీ రామచంద్రయ్య కారుకు నిప్పుపెట్టి దహనం చేసేందుకు ప్రయత్నించారు. ఇంటి వద్ద పార్కింగ్ చేసిన కారుకు నిన్న రాత్రి దుండగులు పెట్రోలు పోసి నిప్పంటించారు. గమనించిన కుటుంబ సభ్యులు, సెక్యూరిటీ సిబ్బంది వెంటనే స్పందించి కారు మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. దీంతో ఎమ్మెల్సీ ఇన్పోవా కారు స్వల్పంగా దహనమైంది.
సమాచారం అందుకున్న ఒకటవ టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎమ్మెల్సీ ప్రసుత్తం గుంటూరులో జరుగుతున్న వైఎస్సార్ ప్లీనరీ సమావేశంలో ఉన్నారు.