అమరావతి : సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా రిటైర్డ్ అయ్యాక దివంగత నేత ఎన్టీఆర్పై పుస్తకం రాస్తానని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీరమణ వెల్లడించారు. తిరుపతిలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలను సీజే ప్రారంభించి మాట్లాడారు. ఎన్టీఆర్కు తనకు ఉన్న అనుబంధాన్ని వివరించారు. ఎన్టీఆర్ ఓ సమగ్ర సమతామూర్తి్ అని కొనియాడారు. ఆయన గురించి ఎంత మాట్లాడినా తక్కువేనని పేర్కొన్నారు.
రైతు బిడ్డగా, సినిమా నటుడిగా, రాజకీయవేత్తగా రాణించారని తెలిపారు. నాడు ఎన్టీఆర్ మనిషిగా తనపై ముద్రవేయడం పట్ల గర్విస్తున్నానని వెల్లడించారు. టీడీపీని ప్రారంభించిన తొలినాళ్లలో ఎన్టీఆర్ కోసం పరోక్షంగా పనిచేశానని గుర్తు చేసుకున్నారు. సంక్షోభ సమయంలో ఆయన తరుఫున వాదించడానికి కూడా ఎవ్వరూ రాలేదని అన్నారు. వ్యక్తిగత, కుటుంబ విషయాలలో ఆయనకు న్యాయపరమైన సలహాలు ఇచ్చేవాడినని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం కేంద్ర మాజీ మంత్రి, ఎన్టీఆర్ కూతురు దగ్గుబాటి పురంధేశ్వరీ అధ్యక్షతన జరిగింది.