అమరావతి : ఏపీలోని హిందూపురం వైసీపీ పార్లమెంట్ సభ్యుడు గోరంట్ల మాధవ్ అశ్లీల వీడియో వ్యవహారంపై ఏపీ మహిళా కమిషన్ స్పందించింది. ఈ మేరకు మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ డీజీపీకి లేఖ రాశారు. విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఘటనలో నిజనిజాలు త్వరగా నిగ్గుతేల్చాలని లేఖలో పేర్కొన్నారు. ఇటీవల ఎంపీ మాధవ్ వీడియో కాల్ చేసి అనుచితంగా ప్రవర్తించిన వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మాధవ్ ఖండించారు.
ఇదే విషయమై ఏపీ ప్రభుత్వ సలహాదారుడు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్టారెడ్డి కూడా స్పందించి ఘటన నిజమని తేలితే పార్టీపరంగా చర్యలు తప్పవని వెల్లడించారు. ఎంపీ మాధవ్ వ్యవహారం ఏపీలో రాజకీయంగా అనేక ఆరోపణలు వస్తుండడంతో మహిళా కమిషన్ స్పందించడాన్ని స్వాగతిస్తున్నారు. అయితే నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని కోరుతున్నారు.