శ్రీకాకుళం: ఇద్దరు పిల్లలను చంపి.. ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది ఓ మహిళ. స్వగ్రామానికి వెళ్లి తిరిగి వచ్చిన భర్తకు భార్యాపిల్లలు చనిపోయి ఉండటాన్ని చూసి బోరున విలపించాడు. దీంతో్ అనకాపల్లిలో తీవ్ర విషాదం చోటుచేసుకున్నది. ఇంటి యజమాని వేధింపుల కారణంగానే ఇంతటి దారుణానికి ఒడిగట్టిందని భర్త అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. పట్టణ సీఐ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నాడు.
వివరాల్లోకి వెళ్తే.. శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం మెట్టపేట గ్రామానికి చెందిన మెట్ట జనార్దన్.. అక్క కూతురు అనూషను ఆరేండ్ల క్రితం పెండ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు సుదీక్ష, గీత అన్విత ఉన్నారు. జనార్దన్కు అచ్యుతాపురంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం రావడంతో ఆరు నెలలుగా అనకాపల్లి-ఉమ్మలాడ రోడ్డులో అద్దెకు ఉంటున్నారు. జనార్దన్ శనివారం శ్రీకాకుళం వెళ్లి తిరిగి సోమవారం సాయంత్రం 5.30 గంటలకు తన సోదరుడితో కలిసి ఇంటికి వచ్చాడు. ఇంట్లో ఇద్దరు చిన్నారులు విగతజీవిగా పడి ఉండడటం, భార్య ఫ్యాన్కు ఉరేసుకుని ఉండటం చూశాడు. భార్యను కిందకు దించి పోలీసులకు సమాచారం చేరవేశాడు. భార్యాపిల్లలు విగతజీవులుగా మారడంతో జనార్దన్ బోరున విలపించాడు. వీరి ఆత్మహత్యతో అనకాపల్లిలో విషాధఛాయలు అలుముకున్నాయి.
డీఎస్పీ బీ సునీల్, పట్టణ సీఐ లంక భాస్కరరావు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి అనూష రాసిన సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు. దాని ఆధారంగా విచారణ జరుపుతున్నట్లు డీఎస్పీ సునీల్ తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా దవాఖానకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఇంటి యజమాని వేధింపుల కారణంగానే తన భార్య మనస్తాపం చెంది ఈ దారుణానికి పాల్పడి ఉండొచ్చని జనార్దన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.