అమరావతి : బీచ్లో గల్లంతైన మహిళ మరో జిల్లాలో ప్రత్యక్షం కావడం అటు పోలీసులను, ఇటు కుటుంబ సభ్యులను ఆశ్చర్యానికి గురిచేసిన ఘటన ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకుంది. విశాఖ బీచ్లో తాను ఫోన్ చూసుకుంటుండగా భార్య సాయిప్రియ సముద్రంలో కొట్టుకుపోయిందని ఆమె భర్త విశాఖ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు , ఈతగాళ్లు బీచ్లో రెండురోజులుగా విస్తృతంగా సముద్రంలో గాలించారు.
అయితే నెల్లూరులో ఓ యువకుడితో సాయిప్రియ ఉన్నట్లు పోలీసులు గుర్తించి భర్తకు సమాచారం అందించారు. పెండ్లి రోజు కావడంతో సాయిప్రియ తన భర్త ఆర్పీ రెడ్డితో కలిసి ఆర్కే బీచ్కి వెళ్లి గల్లంతయిన విషయం విధితమే.