అమరావతి : ఏపీ ఉద్యోగులకు రెండు, మూడు రోజుల్లో పీఆర్సీపై ప్రకటన చేస్తానని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఉద్యోగులకు మెరుగ్గా పీఆర్సీని ఇవ్వడానికే ప్రయత్నిస్తానని వెల్లడించారు. ఎంత మంచి చేయగలిగితే అంత మంచి చేస్తానని భరోసా ఇచ్చారు. గురువారం తాడెపల్లి క్యాంపు కార్యాలయంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో దాదాపు రెండు గంటల పాటు సమావేశమై ఉద్యోగుల సమస్యలను అడగడంతో పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా సీఎం మరోమారు జేఏసీ నాయకులకు వివరించారు.
‘ ఉద్యోగ సంఘాలు చెప్పిన అంశాలను స్వయంగా నోట్ చేసుకున్నానని, అన్నింటినీ స్ట్రీమ్లైన్ చేయడానికి అడుగులు ముందుకేస్తామని’ వెల్లడించారు. ఉద్యోగులు కూడా ప్రాక్టికల్గా ఆలోచించాలని , రాష్ట్ర ప్రభుత్వం మోయలేని భారాన్ని మోపకుండా ఆలోచించాలని, ఉద్యోగులు సానుకూల దృక్పథంలో ఉండాలని జగన్ కోరారు.