అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి నాలుగు రోజుల ప్యారీస్ పర్యటనపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. విదేశి ప్రయాణాలపై ఆంక్షలు ఉండగా ప్యారిస్కు ఎలా వెళ్తారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఏపీ సీఎంవో అధికారులు మాత్రం సీఎం పర్యటన ఖరారైందని వెల్లడించింది. ఈనెల 28న రాత్రి బయలు దేరి 29న ప్యారిస్కు చేరుకుంటారని అధికారులు తెలిపారు.
తన పెద్ద కుమార్తె హర్షరెడ్డి ఇన్సీడ్ బిజినెస్ స్కూల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్(ఎంబీఏ) పూర్తి చేసుకోవడంతో గ్రాడ్యుయేషన్ డే వేడుకలో పాల్గొనడానికి సీఎం వెళ్తున్నారని పేర్కొన్నారు. జులై 2న తిరుగు ప్రయాణం అవుతారని వారు వివరించారు. అయితే తనకు పారీస్ వెళ్లడానికి అనుమతి ఇవ్వాలంటూ జగన్ గత 10 రోజుల క్రితం సీబీఐ కోర్టును అభ్యర్థించారు. ఈ అభ్యర్థనను తిరస్కరించాలని కోర్టులో సీబీఐ కౌంటర్దాఖలు చేసింది. పలు కారణాలు చెప్పి విదేశాలకు వెళ్తున్నారని, ఇది విచారణపై ప్రభావం పడుతుందని వివరించింది. జగన్ పారిస్ వెళ్తే కేసుల విచారణలో జాప్యం జరుగుతుందని సీబీఐ పేర్కొంది .
అయితే కోర్టు నుంచి అనుమతి రాకముందే పర్యటన ఖరారు కావడం అసలు జగన్ పర్యటన కొనసాగుతుందా లేదా అన్నదానిపై అనుమానాలు వ్యక్త మవుతున్నాయి.