అమరావతి : ఎమ్మెల్యే, ప్రముఖ సినీనటుడు బాలకృష్ణ(Balakrishna) వ్యాఖ్యలపై పల్నాడు జిల్లా నర్సాపురం వైసీపీ ఎమ్మెల్యే(YCP MLA) గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. నియోజకవర్గంలో పనికిమాలిన వ్యక్తికి ఒత్తాసు పలికి స్థాయిని దిగజార్చుకోవద్దని హితవు పలికారు. ‘ నా నియోజకవర్గ సమస్యలపై మాట్లాడేందుకు నీకేం పని ? . నువ్వు హీరో అయితే నీ పార్టీకి గొప్ప. నాకు కాద’ ని అన్నారు. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని సూచించారు.
తాను మూడో కన్ను తెరిస్తే ఏమవుతుందోనని చేసిన హెచ్చరికలపై ఎమ్మెల్యే స్పందించారు. ‘ మనుషులకు మూడో కన్ను ఉండదని తెలుసుకోవాలని సూచించారు. ఏదో ఒకటి అనడం, తప్పైందని వెనక్కి తీసుకోవడం బాలకృష్ణకు అలవాటుగా మారింద’ ని ఎద్దేవా చేశారు. సినిమాల్లో లాగా జీవితంలో నటించడం కుదరదని తెలుసుకోవాలని సూచించారు.
ఇటీవల నర్సాపురంలో పర్యటించిన సందర్భంగా బాలకృష్ణ(Balakrishna) ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్రెడ్డి(Gopireddy Srinivasreddy) పై పలు వ్యాఖ్యలు చేశారు. తన సినిమా పాట(Cinema Song) వేయవద్దని ఎమ్మెల్యే అభ్యంతరం వ్యక్తం చేయడం పట్ల బాలకృష్ణ మండిపడ్డారు. తాను అభిమానులకు చిటికేస్తె చాలు. జాగ్రత్త ’ అంటూ హెచ్చరించారు. రాజకీయంగా ఆరోపణలు చేస్తే ఎదుర్కొవడానికి తాను సిద్ధమేనని అన్నారు. సినిమా పరంగా వ్యాఖ్యలు చేసి దిగజారవద్దని ఎమ్మెల్యే గోపిరెడ్డికి సూచించారు.