తిరుమల : కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని నవంబర్ నెలలో 19.73 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ.108.46 కోట్లు వచ్చిందని ఆలయ అధికారులు వెల్లడించారు. 97.47 లక్షల లడ్డూలను విక్రయించామని , 36. 50 లక్షలమ మంది భక్తులకు అన్న ప్రసాదం చేశామని వివరించారు. ఈ నెలలో 7.06 లక్షలు మంది తలనీలాలు సమర్పించుకున్నారని తెలిపారు.
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ (Devotees Rush) కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 5 కంపార్ట్మెంట్లు (Compartments) నిండిపోగా టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న స్వామివారిని 58, 278 మంది భక్తులు దర్శించుకోగా 17,220 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3. 53 కోట్లు వచ్చిందని పేర్కొన్నారు.