అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 184 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానలు, సర్వేలో 29, 721 మంది నుంచి నమూనాలు సేకరించామని ఏపీ వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన బులిటిన్లో అధికారులు పేర్కొన్నారు. గడిచిన 24 గంటల్లో 214 మంది పూర్తిగా కోలుకున్నారని, ప్రస్తుతం ఏపీలో 2163 యాక్టివ్ కేసులు ఉన్నాయని వెల్లడించారు.కొవిడ్ వల్ల కృష్ణా జిల్లాలో ఒకరు మరణించారని తెలిపారు.
కాగా చిత్తూరులో 36 మందికి, గుంటూరులో 18, ఈస్ట్గోదావరిలో 11 మంది, కృష్ణాలో 34 మంది, నెల్లూరులో 13 మంది, విశాఖపట్నంలో 16 మంది, శ్రీకాకుళంలో 13 మంది, వెస్ట్ గోదావరిలో 30 మంది అత్యధికంగా కొవిడ్ బారిన పడిన వారిలో ఉన్నారని వివరించారు.