అమరావతి : ఎన్టీరామారావు తరువాత రాష్ట్రంలో ఏపీ సీఎం జగన్ బడుగు, బలహీన, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీలు రాజకీయం, ఆర్థిక, సామాజికంగా ఎదగాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారని తాజా మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. తమకు క్యాబినేట్ హోదా కోసమో, గౌరవం కోసం పని చేయడం లేదని అన్నారు. జగన్ వెంట సైనికుల్లా పనిచేస్తామని, రాష్ట్ర, పార్టీ భవిష్యత్ కోసం తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి పనిచేస్తామని పేర్కొన్నారు. పార్టీలో చేరినప్పటి నుంచి తమను అన్ని విధాల సముచిత గౌరవం ఇచ్చారని గుర్తు చేశారు.
పార్టీ , రాష్ట్రం కోసం జగన్ గ్యారేజీలో పనిచేస్తామని స్పష్టం చేశారు. తాము ఎప్పుడు పదవుల కోసం పాకులాడలేదని వివరించారు. మంత్రి పదవులు రాకపోవడంతో అనుచరుల్లో కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ త్వరలోనే సర్దుకుంటాయని మరో మాజీ మంత్రి పేర్ని నాని తెలిపారు. తొలి క్యాబినేట్లో తమకు చోటు కల్పించడం అదృష్టంగా భావిస్తున్నానని వెల్లడించారు.