తిరుపతి : తిరుపతి రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్టాండ్ కు సమీపంలోని గోవిందరాజ స్వామి సత్రాలను ఆధునీ కరించి సామాన్య భక్తులకు మరింత మెరుగైన వసతులు సమకూరుస్తామని టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి తెలిపారు. టీటీడీ పాలక మండలి సభ్యులు పోకల అశోక్ కుమార్ తో కలిసి తిరుపతిలోని రెండవ, మూడవ సత్రాలను పరిశీలించారు. భక్తులకు ఉచితంగా కేటాయిస్తున్న గదుల్లో మంచాలు, పరుపులు ఏర్పాటు చేయా లని అధికారులను ఆదేశించారు.
ఉచిత , రూ 50 అద్దె గదుల్లో మరుగుదొడ్లు, స్నానపు గదులను ఆయన పరిశీలించారు. గదులతో పాటు ఖాళీ ప్రదేశాలను కూడా శుభ్రంగా ఉంచాలన్నారు. సామూహిక వంట శాలలో ఫ్యాన్లు ఏర్పాటు చేసి యాత్రీకులు ఉపయోగించుకునే ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ నెల 27వ తేదీ నుంచి అక్టోబరు 5వ తేదీ వరకు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చైర్మన్ వెల్లడించా రు. ఆయన వెంట జెఈవో వీర బ్రహ్మం, చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, ఎస్ఈ వెంకటేశ్వర్లు, డిప్యూటీ ఈవో శ్రీమతి భారతి ఇతర అధికారులు పాల్గొన్నారు.