అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రతి సాగునీటి ప్రాజెక్టును పూర్తిచేస్తామని ఏపీ జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి జలవనరుల శాఖ కీలక బాధ్యత లు అప్పగించిన సీఎం జగన్కు రుణపడి ఉంటానని తెలిపారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రారంభించిన జలయజ్ఞాన్ని పూర్తి చేయడంలో తనకు అవకాశం కలగడం సంతోషంగా ఉందని అన్నారు.
ఏపీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రాజన్న దొర ఇవాళ సచివాలయంలో పదవి బాధ్యతలు చేపట్టారు. గిరిజన సంక్షేమ కార్యాలయంలో కారుణ్య నియమకాల ఫైలుపై ఆయన తొలి సంతకం చేశారు. శాఖాపరమైన ప్రమోష న్లు కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం గా తనకు అవకాశం కల్పించడం పట్ల ముఖ్యమంత్రికి కుటుంబం తరుఫున కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రిగా అమర్నాథ్ సచివాలయం లో బాధ్యతలు చేపట్టారు.