అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని తామే అద్భుతంగా నిర్మిస్తామని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు వెల్లడించారు. సోమవారం కృష్ణ జిల్లాలో పర్యటించి ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అమరావతి రాజధానిని కడతామని చంద్రబాబు కట్టలేకపోయారని, సీఎం జగన్ కూడా మాట మార్చి వైజాగ్కు తరలించే ఆలోచన చేస్తున్నారని ఆరోపించారు.
2024లో ఏపీలో బీజేపీ అధికారంలోకి వస్తుందని, తామే అద్భుతమైన రాజధానిని నిర్మిస్తామని వెల్లడించారు. రూ.10వేల కోట్లు మంజూరు చేసి మూడు సంవత్సరాల్లో పూర్తి చేస్తామన్నారు. ఏపీలో అభివృద్ధి జరగడం లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రభుత్వానికి దిశ, దశ లేకుండా ఆలోచనలు చేస్తున్నారని ఆరోపించారు.