అమరావతి : పండుగలు భిన్న సంస్కృతికి ప్రతిబింబాలు. ఒకే పండుగ ప్రాంతాలు అక్కడి ఆచారాలను బట్టి నిర్వహించుకోవడం అనాదిగా వస్తుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగను మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించుకోవడం సంప్రదాయంగా వస్తుంది. పండుగ రోజుల్లో ఆంధ్రాలో అనధికారికంగా కోడి పందేలు, తమిళనాడులో అధికారికంగా జల్లికట్టు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కాని ఇది వినడానికి, చూడడానికి విడ్డూరంగా ఉన్నా పోటీ ప్రపంచంలో ఏ జంతువుతో నైనా పోటీలు జరుపవచ్చని నిరూపిస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం ప్రజలు.
ఈ ప్రాంతానికి చెందిన కొందరు ప్రజలు పందుల కుస్తీపోటీలు నిర్వహిస్తూ కొత్త సంప్రదాయానికి తెర లేపుతున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందాలు,గుండాట వంటి పోటీలతో కొన్ని కుటుంబాలు ఆర్థికంగా నష్టపోతున్నారని, ఎవరూ నష్టపోకుండా ఉండడానికి తెలిపారు. తాము సంప్రదాయానికి అధిక ప్రాదాన్యతను ఇవ్వడానికి పందుల కుస్తీపోటీలను నిర్వహిస్తున్నామని పశ్చిమ గోదావరి జిల్లా ఎస్టీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సింగం సుబ్బారావు తెలిపారు.