అమరావతి : తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామ సచివాలయ మహిళా వాలంటీర్ సమీపంలో గోదావరి నదిలోకి దూకి ఆత్మహత్యకు యత్నించింది. విషయం తెలుసుకున్న వైసీపీకి చెందిన 12వ వార్డు కౌన్సిలర్ విజయ్ అలియాస్ దుర్గారావు అక్కడికి చేరుకుని సంఘటన స్థలంలో దూకి ఆమెను రక్షించగా ప్రమాదవశాత్తు తాను మునిగి మృతి చెందాడు. స్థానిక మత్స్యకారులు నదిలో గాలింపు చర్యలు చేపట్టి వార్డు కౌన్సిలర్ మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు .
ఈ ఘటనలో సచివాలయ ఉద్యోగినికి అస్వస్థత కలగడంతో ఆమెను దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే మహిళా ఉద్యోగిని ఆత్మహత్య యత్నానికి గల కారణాలు తెలియరాలేదు.