అమరావతి: దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలు, విద్యుత్ చార్జీలు అధికంగా ఉన్నాయని నిరసిస్తూ టీడీపీ నాయకులు గురువారం పాదయాత్ర నిర్వహించారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల తొలిరోజు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, శాసనసభ్యులు బ్యానర్ పట్టుకుని అసెంబ్లీ వరకు పాదయాత్ర నిర్వహించారు.
ప్రజలకు భారంగా మారిన పెట్రోధరలు తగ్గించాలని బాబు డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు వీడేంత వరకు ప్రభుత్వాలపై ఉద్యమం కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు.