అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లాలో ఘోరం జరిగింది. జిల్లాలోని కారంచేడు మండలం కుంకల మర్రు గ్రామానికి చెందిన సీహెచ్ నాగమణి పర్చూరు మండలం గొల్లపూడిలో వీఆర్వోగా పనిచేస్తుంది. శుక్రవారం ఆమె చీరాల స్టేషన్ వద్ద రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతుంది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనపై విచారణ జరుపుతున్నారు.