అమరావతి : రైతు వద్ద లంచం తీసుకున్న వీఆర్వోను ఏసీబీ అధికారులు రెడ్ హ్యండెడ్గా పట్టుకున్న సంఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని బొల్లాపల్లి మండలం మేళ్లవాగు సచివాలయ వీఆర్వో అమ్మిశెట్టి వెంకటేశ్వర్లు పాస్పుస్తకం కోసం రైతును రూ. 3. 50 లక్షలు డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. అధికారులు పక్కా వ్యుహంతో రసాయనాలు కలిపిన నోట్లను రైతుకు అందజేశారు.
ఇవాళ రైతు గ్రామ సచివాలయంలో నగదు ఇస్తుండగా వీఆర్వోను రెడ్ హ్యండెడ్గా పట్టు కున్నారు. అతడిపై కేసు నమోదు చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. లంచం కోసం డిమాండ్ చేసే అధికారులు, ఉద్యోగుల సమాచారాన్ని తమకు అందజేస్తే బాధితులకు తగిన న్యాయం చేస్తామని వారు పేర్కొన్నారు.