AP News | ఏపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైఎస్సార్సీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. వైజాగ్లో మరో కీలక నేత పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇప్పటికే ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్ పార్టీని వీడగా.. తాజాగా ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సీతంరాజు సుధాకర్ రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఏపీ సీఎం జగన్కు లేఖ పంపించారు. జగన్కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న సుధాకర్ రాజీనామా చేయడం ఇప్పుడు వైఎస్సార్సీపీలో సంచలనంగా మారింది.
వైఎస్సార్ కుటుంబానికి విధేయుడిగా ఉన్న సీతంరాజు సుధాకర్.. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖ దక్షిణ నుంచి పోటీ చేయాలని భావించారు. కానీ తనకు టికెట్ దక్కే అవకాశం లేకపోవడంతో పార్టీ నుంచి వైఎస్సార్సీపీని వదిలిపెట్టారు.