అమరావతి : మాజీ మంత్రి వివేకానంద రెడ్డి ( Viveka Murder Case ) హత్యకేసులో నిందితుడిగా ఉన్న కడప ఎంపీ అవినాష్రెడ్డికి సీబీఐ శుక్రవారం కోర్టు సమన్లు జారీ చేసింది . ఆగస్టు 14న కోర్టుకు హాజరు కావాలని సమన్లులో పేర్కొంది. ఈ హత్య ఎనిమిదవ నిందితుడిగా అవినాష్రెడ్డి పేరును చేర్చింది. అవినాశ్రెడ్డి, వైఎస్ భాస్కర్రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిపై ఇటీవల సీబీఐ దాఖలు చేసిన అనుబంధ ఛార్జిషీట్ను సీబీఐ కోర్టు పరిగణనలోకి తీసుకుంది.
కాగా ఈ కేసులో చంచల్గూడ జైల్లో ఉన్న నిందితులు శుక్రవారం సీబీఐ కోర్టులో జరిగిన విచారణకు హాజరయ్యారు. వీరికి మరోసారి ఆగస్టు 14 వరకు రిమాండ్ పొడిగించింది. ఎంపీ అవినాష్రెడ్డి ఈ కేసులో ముందస్తు బెయిల్ పొందిన విషయం తెలిసిందే .