అమరావతి : టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు మరోసారి ఏపీ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ సీఎం జగన్ రాష్ట్రాన్ని అధోగతిపాలు చేస్తున్నారని, ట్రెజరీ కోడ్ ఉల్లంఘించి అనుచరులకు దోచిపెడుతున్నారని విమర్శించారు . ఓడీ కింద తీసుకొచ్చిన రూ. 31 వేల కోట్లను దేనికి ఖర్చుపెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు.
టీడీపీ హయాంలో ఏడాదికి సరాసరి రూ. 32.800 కోట్లు అప్పుచేసిందని వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం ఏడాదికి రూ. 1,11,472 కోట్లు అప్పు చేసిందని పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ఐదు నెలల్లోనే రూ. 46. 803 కోట్లు అప్పు చేశారని ఆరోపించారు.