అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా మేకపాటి విక్రమ్రెడ్డి నామినేషన్ వేశారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేసిన మేకపాటి గౌతం రెడ్డి ఆకస్మిక మరణంతో ఖాళీ అయిన ఆత్మకూరు స్థానాన్ని సోదరుడు విక్రమ్రెడ్డికి వైసీపీ అధిష్టానం పోటీకి అవకాశం కల్పించింది. దీంతో ఇవాళ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డి, వైసీపీ నాయకులు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి తదితరుల సమక్షంలో నామినేషన్ దాఖలు చేశారు.
ఈ సందర్భంగా అభ్యర్థి విక్రమ్రెడ్డి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం చేపడతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వల్ల తాను ఉప ఎన్నికల్లో లక్ష మెజారిటీతో విజయం సాధిస్తానని ధీమాను వ్యక్తం చేశారు.