అమరావతి: ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేశ్పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా విమర్శలు చేశాడు. ‘పప్పూ… నిన్ను చూస్తే జాలేస్తోంది! మీ నాన్న దత్తపుత్రుడిని నమ్మాడు…గరుడ పురాణాన్ని నమ్మాడు…చెప్పులు పార్టీని నమ్మాడు… చివరికి దిష్టి రాజు దిబ్బ రాజును కూడా నమ్మాడు…నిన్ను మాత్రం నమ్మలేదు! అయినా, పప్పూ… నువ్వు మాత్రం మీ నాన్ననే నమ్ము.’ అంటూ విజయసాయిరెడ్డి సెటైర్లు వేశాడు.
‘రాష్ట్రంలో కోవిడ్ మరణాల పాపం చంద్రబాబుకు తప్పక చుట్టుకుంటుంది. ఐదేళ్ల పాలనలో ఆరోగ్యశ్రీ నిధులన్నీ కార్పోరేట్ హాస్పిటళ్లకు మళ్లించాడు. ప్రభుత్వ ఆస్పత్రుల అభివృద్ధిని నిర్లక్ష్యం చేశాడు. ఇక్కడ మౌలిక వసతుల కొరత వల్లే రోగులు పక్క రాష్ట్రాలకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందని’ మరో ట్వీట్లో మండిపడ్డారు.
‘సొంత పార్టీ ఎంపీలు నలుగురిని స్వయంగా తనే బీజేపీలోకి పంపించాడు. దానిపై ఒక్క మాట మాట్లాడలేదు. వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీని లోబర్చుకుని తల్లిలాంటి పార్టీపై ఆరోపణలు చేయిస్తాడు. ప్రభుత్వంపై కేసులు వేయిస్తాడు. దీన్ని రాజకీయం అంటారా బ్రోకరిజం అంటారా చంద్రబాబూ?’ అంటూ మరో ట్వీట్లో విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.