అమరావతి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా సెటైర్లు వేశారు. ‘జూమ్ మీటింగ్ అనగానే వాలిపోయే పచ్చ నేతలు ఒక్కరూ నియోజకవర్గాల్లో కనిపించరు. ప్రజలను గాలికొదిలేశారు సరే పరామర్శల కోసం విశాఖ వచ్చిన లోకేశంనూ పట్టించుకోలేదు. అద్దె మైకులతో రెచ్చిపోయే అచ్చన్న, అయ్యన్న, కూన, గంటా ఏమైపోయారు? లోకేశం అంటే అచ్చన్నకున్న అభిప్రాయమే అందరిదా?’ అంటూ విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
‘ఏ పార్టీ అయినా ఓడిపోయాక ఆత్మపరిశీలన చేసుకుంటుంది. టీడీపీ మాత్రం పరనిందకే పరిమితమైంది. మహానాడులో ప్రభుత్వంపై తీర్మానాలు పెట్టి ఏం పీకుతావ్ బాబూ? కుప్పంలో ఎందుకు ఖంగుతిన్నావో, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అభ్యర్థులు ఎందుకు దొరకలేదో ఆ జూమ్ నాడులో ఏడవండి. ఇంకెంతకాలం ఈ ఆత్మవంచన? ఎన్టీఆర్ నెలకొల్పిన టీడీపీ ఎప్పుడో కనుమరుగైంది. బాబు జయప్రదంగా కొట్టేసిన పార్టీ కూడా ఫినిష్ అయింది. అరెస్టులను ఖండించడం, బెయిళ్లు, స్టేలు సంపాదించడానికే పరిమితమైంది. కుప్పంలోనే కొట్టుకు పోయాక అచ్చెన్న మాటలు నిజం కాకుండా ఎలా పోతాయి. జూమ్ మహానాడులే మిగిలాయంటూ’ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.