అమరావతి : ఆంధ్రప్రదేశ్లో విజిలెన్స్ అధికారులు ప్రధాన ప్రభుత్వాసుపత్రులపై ఏకకాలంలో దాడులు నిర్వహించి తనిఖీలు చేశారు. ఉమ్మడి కడపలోని రాజంపేట, ప్రొద్దుటూరు, నందలూరు ఆసుపత్రుల్లో తనిఖీలు నిర్వహించారు.
ఉద్యోగుల హాజరు, మందుల నిల్వలు, సిబ్బంది కొరత, పనితీరుపై ఆరా తీశారు. కాకినాడలోని తుని ఏరియా ఆస్పత్రిలో రోగులకు అందుతున్న చికిత్సలపై ఆరా తీశారు. విశాఖ ఆరిలోవ విమ్స్ ఆస్పత్రిని తనిఖీ చేసి వివరాలు సేకరించారు. మందుల రిజిస్ట్రర్లను, సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు.