న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతిపట్ల ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. గౌతమ్ రెడ్డి పరమపదించడం అత్యంత విచారకరమన్నారు. గౌతమ్ రెడ్డి సౌమ్యులు, సంస్కారవంతులు అని ఆయన కొనియాడారు. ప్రజా సమస్యల పట్ల అవగాహన, పని పట్ల నిబద్ధత కలిగిన నాయకులు అని ప్రశంసించారు. తానంటే గౌతమ్ రెడ్డి ఎంతో అభిమానం చూపేవారు అని గుర్తు చేసుకున్నారు. గౌతమ్ రెడ్డి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నానని ఉప రాష్ట్రపతి పేర్కొన్నారు.
సోమవారం ఉదయం గౌతమ్ రెడ్డికి గుండెపోటు రావడంతో.. హైదరాబాద్లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి తీసుకొచ్చే లోపే గౌతమ్ రెడ్డి కన్నుమూసినట్లు వైద్యులు తెలిపారు. వారం రోజులపాటు దుబాయ్ ఎక్స్పోలో పాల్గొన్న గౌతమ్ రెడ్డి.. రెండు రోజుల క్రితమే హైదరాబాద్కు చేరుకున్నారు. ఇటీవలే కొవిడ్ బారిన పడ్డ గౌతమ్ రెడ్డి త్వరగానే కోలుకున్నారు. పోస్టు కొవిడ్ పరిణామాలే గుండెపోటుకు కారణమై ఉండొచ్చని ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు అనుమానిస్తున్నారు.