విజయవాడ : దివంగత ముఖ్యమంత్రి ఎన్టీరామారావు నాలుగో కుమార్తె ఉమామహేశ్వరి ఆత్మహత్య ఘటనపై వైసీపీకి చెందిన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉమామహేశ్వరి ఆత్మహత్యపై సీబీఐ చేత విచారణ జరిపించి నిజాలు వెలికితీయాలని ఆయన డిమాండ్ చేశారు. బంజారాహిల్స్లోని తన నివాసంలో ఉమామహేశ్వరి ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో బుధవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వెల్లంపల్లి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనను మీడియా కలిసినప్పుడు పై విధంగా స్పందించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారంటూ వెల్లంపల్లి మండిపడ్డారు. ఆయన దరిద్రపుగొట్టు రాజకీయాల కారణంగా ఎవరు బలవుతున్నారో తెలియకుండా ఉన్నదన్నారు. మిగిలిన తమ ఎంపీలను కూడా బీజేపీలోకి పంపేందుకు జాతీయ నేతలతో ఆయన రహస్య మంతనాలు జరుపుతున్నారని ఆరోపించారు. బీజేపీ నేతలు పిలువకున్నా మోదీ కాళ్లు పట్టుకునేదుకు ఢిల్లీ వెళ్తున్నారని దుయ్యబట్టారు. ఇలాంటి గజదొంగను దేశంలో ఎవరూ నమ్మే స్థితిలో లేరన్నారు. త్వరలోనే ఆయన నీచ, నికృష్ట రాజకీయాలు బట్టబయలు అవుతాయని ఆయన చెప్పారు. వైసీపీని ఎదుర్కొనే సత్తా ఏపీలో ఉన్న పార్టీలకు లేదని, వచ్చే ఎన్నికల్లో అన్ని పార్టీలు ఒక్కటైనా జగన్మోహన్రెడ్డిని ఓడించలేరని అన్నారు.