విజయవాడ : భవానీపురంలో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక అపార్ట్మెంట్పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ స్పందించారు. ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమన్నారు బాలిక ఆత్మహత్య ఘటనను ప్రభుత్వం సీరియస్గా తీసుకున్నదని, నిందితులకు శిక్ష పడుతుందని ఆమె అన్నారు. బాలిక ఆత్మహత్య చేసుకునేందుకు ప్రేరేపించిన వారు ఎంత వారలైనప్పటికీ విడిచి పెట్టేది లేదని పేర్కొన్నారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు.
ఓ రాజకీయ నేత వేధింపులు తాళలేకనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు బాలిక తన సూసైడ్ నోట్లో వెల్లడించింది. ఈ విషయం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆమె ఆత్మహత్యకు ఓ రాజకీయ నాయకుడే కారణమని ఆమె తల్లిదండ్రులు కూడా చెప్ఉతన్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అదే అపార్ట్మెంట్లో ఉంటున్న ఓ పార్టీ నాయకుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఐదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన బాలిక సీసీటీవీ ఫుటేజీ హార్డ్ డిస్క్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆత్మహత్యకు ముందు బాలిక 20 నిమిషాల పాటు టెర్రస్పై తిరిగినట్లు సీసీటీవీ ఫుటేజీలో పోలీసులు గుర్తించారు. ఓ రాజకీయ పార్టీ నాయకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అరెస్టయిన నాయకుడు ఇటీవలి కార్పొరేషన్ ఎన్నికల్లో 37వ డివిజన్ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు.