హైదరాబాద్ : తెలుగు వారికి అతి పెద్ద పండుగ సంక్రాంతి. ఉపాధి కోసం గ్రామాల నుంచి పట్టణాలకు వలసలు పెరిగిన తరువాత సంక్రాంతి పండుగ చేసుకునే తీరులో మార్పులు వచ్చాయి కానీ, సంప్రదాయ వంటకాల పరంగా మాత్రం మార్పేమీ రాలేదు. పండుగ రోజున పిండివంటలు, ఇప్పటికీ ప్రతి తెలుగింట నోరూరిస్తుంటాయి. పండుగకు వారం రోజుల ముందు నుంచే ఇళ్లలో ప్రారంభమయ్యే హడావుడి ముక్కనుమ వెళ్లిన మూడు రోజుల వరకూ కనిపిస్తుంది. కొత్త ధాన్యం ఇళ్లకు చేరటంతో అరిసెలు, పూత రేకులు లాంటి వెరైటీలతో పాటు పులగం, పరమాన్నం,చక్కెర పొంగళి,పాయసం.. ఇలా ఎన్నో వంటకాల విందు అలరిస్తుంటుంది.
సంక్రాంతి పండుగ సమయంలో ప్రతి ఇంటిలోనూ కనిపించే అరిసెలు, కజ్జికాయలు, మురుకులు(జంతికలు), బూందీ లడ్డు వంటి వాటి తయారీలో కలిసి ఉండటమనే పరమార్ధమూ దాగి ఉంది. ఎందుకంటే అరిసెలు లాంటి పిండివంటలు చేయడం ఒక్కరివల్ల అయ్యేది కాదు. సంక్రాంతి వేళ తప్పనిసరి పిండివంటకాలలో అరిసెలు అత్యంత ప్రధానమైనవి. తెలంగాణా, ఆంధ్ర, రాయలసీమ.. మూడు ప్రాంతాల్లోనూ అరిసెలు తప్పనిసరిగా సంక్రాంతి వేళ కనిపిస్తాయి.
‘‘సంక్రాంతి పండుగలో ప్రతి ఒక్కరూ విభిన్న రకాల స్వీట్లు, ఇతర రుచులు ఆస్వాదించడానికి ఇష్టపడుతుంటారు. పండుగ పూర్తయిన తరువాత కూడా ఇది కొనసాగుతుంది. అత్యుత్తమ నాణ్యత కలిగిన పదార్ధాలతో పాటు,వాటి తయారీలో వినియోగించే నూనె కూడా అంతే నాణ్యతతో ఉండాల్సిన ఆవశ్యకత ఉన్నది. అంతర్జాతీయనాణ్యత తయారీ ప్రమాణాలను అనుసరించే గోల్డ్ డ్రాప్ నూనెలో వండే పిండివంటలు, విభిన్న రకాల ఆహార పదార్థాలు ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి. మా వరకూ ఇది ‘సంక్రాంతి కా స్వాద్’’ అని గోల్డ్ డ్రాప్ సేల్స్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ మితేష్ లోహియా” అన్నారు.