అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని గన్నవరం వైసీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి కరోనా పాజిటివ్ సోకింది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్లో హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు. ఇటీవల తనను కలిసిన వారు ముందుస్తుగా పరీక్షలు చేయించుకోవాలని ఆయన విన్నవించారు.
ఏపీలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుంది. ఇవాళ 223 కేసులు నమోదుగా కాగా 114 మంది రికవరి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 977 యాక్టివ్ కేసులున్నాయని వైద్యాధికారులు వెల్లడించారు .