తిరుపతి : తిరుపతి సమీపంలోని పేరూరు బండ మీద నిర్మించిన శ్రీ వకుళమాత ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వెల్లడించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, టీటీడీ పాలక మండలి సభ్యుడు పోకల అశోక్ కుమార్ తో కలసి ఆయన సతీ సమేతంగా వకుళ మాత ఆలయాన్ని సందర్శించారు. ఆలయం వద్ద చైర్మన్ దంపతులకు అర్చకులు అధికారులు స్వాగతం పలికారు.
సుబ్బారెడ్డి దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు . అనంతరం అర్చకులు వేద ఆశీర్వాదం చేసి అమ్మవారి ప్రసాదాలు అందజేశారు . మంత్రి శ్రీ రామచంద్రారెడ్డి చైర్మన్ దంపతులను శాలువాతో సన్మానించారు. ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారని ఇక్కడ అవసరమైన అభివృద్ధి పనులన్నీ చేస్తామన్నారు . జెఈవో వీరబ్రహ్మం , చీఫ్ ఇంజినీర్ నాగేశ్వర రావు , డిప్యూటీ ఈవో వరలక్ష్మి పాల్గొన్నారు .