అమరావతి : ఉత్తరాంధ్రలో నెలకొన్న సమస్యలపై వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు జనపోరు యాత్రను నిర్వహిస్తున్నామని బీజేపీ ఏపీ శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు. ఈ నెల 7, 8, 9 తేదీలో ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టుల సమగ్ర పరిశీలనకు యాత్ర నిర్వహి స్తున్నామన్నారు. వంశదార సహా ఇతర ప్రాజెక్టులపై సమగ్ర పరిశీలన పత్రం రూపొందిస్తామని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో సంక్షేమం పేరుతో జగన్ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు.
మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గుంటూరులో మాట్లాడుతూ వైఎస్ జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వరాల జల్లు కురిపించి అధికారంలోకి రాగానే హామీలను మరచిపోయారని విమర్శించారు. రైతులకు 9 గంటల విద్యుత్ ఏమైందని నిలదీశారు. ఏపీలో అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ ప్రభుత్వం ఏడుసార్లు కరెంట్ ఛార్జీలను పెంచి ప్రజలపై భారం మోపారని, నవరత్నాల పేరుతో ప్రజలను మోసగిస్తున్నారని దుయ్యబట్టారు.