అమరావతి : ఏపీలోని విశాఖపట్నం జిల్లా గోపాలపట్నం ఆర్ఆర్ వెంకటాపురంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. వీరు ద్విచక్రవాహనాన్ని అతివేగంగా నడుపడంతో అదుపుతప్పిడివైడర్ను ఢీ కొట్టింది. దీంతో ద్విచక్రవాహనంపై ఉన్న ప్రదీప్(35), సోమరాజుల హనుమ(33) అనే ఇద్దరు యువకులు మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.