అమరావతి : కర్నూలు జిల్లా మద్దికేర వద్ద ప్రమాదం జరిగింది. మిరపకోతకు వెళ్లి వ్యాన్లో తిరిగివస్తుండగా ప్రమాదవశాత్తు టైర్పేలి (Tyre burst) విద్యుత్ స్తంభానికి ఢీకొనగా అందులో ఉన్న కూలీల్లో ఇద్దరు మహిళలు మృత్యువాత పడ్డారు. ఘటనలో మరో 10 మందికి తీవ్రగాయలయ్యాయి . మృతులు మద్దికేర ఆగ్రహారానికి చెందిన ఆదిలక్ష్మి, సంజయమ్మలుగా గుర్తించారు. గాయపడ్డ క్షతగాత్రులను అనంతపురం జిల్లా గుంతకల్లు ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. పోలీసులు కేసు(Police Case) నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.