అమరావతి : కర్నూలు జిల్లాలో మరో రెండు రోడ్డు ప్రమాదాలు జరిగి ముగ్గురు మృత్యువాత పడ్డారు. జిల్లాలోని నందికొట్కూరు మండలం దామగట్ల క్రాస్రోడ్డు వద్ద ఆర్టీసీ బస్సు , మిర్చిలోడ్తో వెళ్తున్న బొలేరో వాహనం ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి.ఈ ప్రమాదంలో బొలెరో డ్రైవర్తో పాటు మరో ప్రయాణికుడు సంఘటన స్థలంలోనే మృతి చెందారు. ఆర్టీసీ డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉండడంతో పాటు గాయపడ్డ 15 మంది ప్రయాణికులను ఆస్పత్రికి తరలించారు.
ఆత్మకూరు పట్టణ శివారులోని ఐస్ ఫ్యాక్టరీ వద్ద బైక్ అదుపు తప్పి చెట్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు.