అమరావతి : ఏపీలో కొత్తగా మరో ఇద్దరు కరోనాతో మృత్యువాత పడ్డారు. వైద్యార్యోగ శాఖ అధికారుల ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 31,473 మంది నుంచి నమూనాలు సేకరించగా 222 మందికి కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నట్లు నిర్దారించామని వారు వెల్లడించారు. వారికి తగిన వైద్య సహాయం అందిస్తున్నామని పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం రాష్ట్రంలో 2560 యాక్టివ్ కేసులు ఉన్నాయని వారు వివరించారు.
కరోనా నుంచి కొత్తగా 275 మంది కోలుకున్నారని తెలిపారు. ఇప్పటి వరకు ఏపీలో 3కోట్ల 97వేల మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని అన్నారు. ఈస్ట్గోదావరి, చిత్తూరు, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, విశాఖపట్నం, వెస్ట్గోదావరి జిల్లాలో అత్యధికంగా కేసులు నమోదయ్యాయని వారు వెల్లడించారు.