అమరావతి : కాకినాడ జిల్లా(Kakinada District)లో చర్చిగోడ కూలి(Church Compound Wall ) ఇద్దరు కూలీలు దుర్మరణం చెందగా మరొకరికి తీవ్రగాయాలు అయ్యాయి. జిల్లాలోని సామర్లకోట మండలం బలుసులపేట గ్రామంలో చర్చి పునర్నిర్మాణ పనులు ఇటీవల ప్రారంభించారు.
ఇందులో భాగంగా బుధవారం కూలీలు నిర్మాణపనులు చేస్తుండగా ఒక్కసారి గోడ కూలి కూలీలపై పడింది. దీంతో ఇద్దరు కూలీలు పిట్టా అర్జునరావు, మచ్చా నాగేశ్వరరావులు అక్కడికక్కడే చనిపోగా మరో కూలికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు(Police) ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. తీవ్రంగా గాయపడ్డ మరోకూలిని ఆస్పత్రిలో చేర్పించి వైద్యం అందిస్తున్నారు.