అమరావతి : ఏపీలోని నంద్యాల (Nandyala) మండలంలో విషాదం చోటు చేసుకుంది. ఓ ఇంట్లో వంట చేస్తుండగా సిలిండర్ పేలి (Cylinder explosion) ఇద్దరు మృతి చెందారు. మండలంలోని చాపిరేవులలో జరిగిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామంలో నివాసముంటున్న వెంకటమ్మ అనే మహిళ ఇంట్లో మంగళవారం వంట చేస్తుండగా ఒక్కసారిగా సిలిండర్ పేలింది.
ఘటనలో వెంకటమ్మ(62), ఆమె మనవడు దినేష్(9) తీవ్ర గాయాలతో అక్కడికక్కడే చనిపోయారు. గాయపడిన ( Injured ) మరో 8 మందిని నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. సిలిండర్ పేలుడు దాటికి ఇంటి పక్కనే ఉన్న రేకుల షెడ్డు కుప్పకూలింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.