అమరావతి : ఏపీలోని పార్వతీపురం(Parvati puram) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని కొమరాడ మండలం సరవపాడులో పాత ఇల్లు(Old house) కూలుస్తుండగా ఒక్కసారిగా గోడ కూలింది . ఈ ఘటనలో శంకరరావు(33), మాణికమ్మ(55) అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో వారిని పార్వతీపురం ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు(Police),రెవెన్యూ అధికారులు(Revenue Officials) ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇల్లును కూలుస్తున్న సమయంలో అజాగ్రత్త వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు(Police Case) నమోదు చేసుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.