అమరావతి : ఏపీలోని బాపట్ల జిల్లా వేటపాలెం మండలం పందిళ్లపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం (Road Accident) లో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. బాపట్ల వైపు నుంచి వెళ్తున్న కారు అదుపుతప్పి పందిళ్లపల్లి వైపు నుంచి చీరాల వైపు వస్తున్న కారును ఢీకొట్టింది . ఈ ఘటనలో ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన శిరీష (29) అక్కడికక్కడే మృతి చెందగా ఆమె భర్త టెండూల్కర్ తీవ్రంగా గాయపడ్డారు.
మరో కారులో ఉన్న ఐదుగురికి గాయాలు కావడంతో వారిని చీరాల ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.